లింగంపేట/సదాశివనగర్/ కామారెడ్డి రూరల్, జూన్ 19: లింగంపేట మండలంలోని భవానీపేటలో బోనాల పండుగను గ్రామస్తులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలను నెత్తిన ఎత్తుకొని గ్రామంలోని ప్రధానవీధుల గుండా డప్పువాయిద్యాల మధ్య ఊరేగించారు. గ్రామదేవతలకు బోనాలు, నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డిలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో బోనాలు తీశారు. మహిళలు గ్రామంలోని ప్రధానవీధుల గుండా బోనాలను డప్పువాయిద్యాల మధ్య ఊరేగించారు. గంగమ్మ, పోచమ్మ, గ్రామదేవతలకు బోనాలను సమర్పించి ప్రత్యేకపూజలు చేశారు. కార్యక్రమంలో గంగపుత్ర సంఘం అధ్యక్షుడు రంగ ఆంజనేయులు, గంగారాం, రాజేశ్, దశరథ్, గడ్డమీది రాజు, శ్యాం, భరత్, రాకేశ్, స్వామి, చింతల గంగయ్య, కిషన్, భరత్, శ్రీనివాస్, హరి, చింతల రాజు, బాల్రాజు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
బోనాల ఊరేగింపులో పాల్గొన్న భవానీపేట గ్రామస్తులు
అడ్లూర్ ఎల్లారెడ్డిలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో బోనాలను ఊరేగిస్తున్న మహిళలు
కామారెడ్డి పట్టణ పరిధిలోని అడ్లూర్ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో గ్రామదేవతలకు బోనాలు తీశారు. సంఘ ప్రతినిధులు వారి ఇండ్ల నుంచి డప్పు వాయిద్యాలు, డీజే చప్పుళ్ల మధ్య అమ్మవారి ఆలయాల వద్దకు బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. కార్యక్రమంలో రజక సంఘం ప్రతినిధులు మహేశ్, సంజీవ్, రవి, మహిపాల్, రాజు, స్వామి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.