ఖలీల్వాడి, జూన్ 30: ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..దవాఖానల్లో అత్యాధునిక వసతులను కల్పిస్తున్నది. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మెరుగైన సేవలను అందిస్తున్నది. నిజామాబాద్ కేంద్ర దవాఖాన (జీజీహెచ్) రోగులకు మెరుగైన సేవలను అందించడంతోపాటు అరుదైన శస్త్ర చికిత్సలు చేస్తూ రాష్ట్రస్థాయిలో రికార్డును సొంతం చేసుకున్నది. కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తూ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా అవార్డులు అందుకున్నది. ప్రభుత్వ దవాఖానలో ఓపీ సేవలు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రతిరోజూ వందలాది మందికి వైద్యసేవలు అందిస్తున్నారు. 700 పడకల దవాఖానలో ఒక్క పడక కూడా ఖాళీగా లేకపోవడం గమనార్హం. మెరుగైన వైద్య సేవలు అందిస్తుండడంతో రోగులు బారులు తీరుతున్నారు. ఏడాదికాలంలో 51, 261 అరుదైన శస్త్ర చికిత్సలు చేసిన ఏకైక ప్రభుత్వ దవాఖానగా జీజీహెచ్ నిలిచింది. మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేల సహకారంతో డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేశారు. మోకాలు చిప్ప మార్పిడి వంటి అరుదైన శస్త్ర చికిత్సలు చేయడంతో ప్రభుత్వ దవాఖానలకు ఆదరణ మరింత పెరిగింది.
అరుదైన ఆపరేషన్లు..
రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నారు. ఇవే సేవలకు ప్రైవేటు దవాఖానల్లో లక్షల రూపాయల ఖర్చవుతుంది. అత్యధికంగా ని జామాబాద్ జిల్లాలోనే అరుదైన ఆపరేషన్లు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా అవార్డులు అందుకున్న ఏకైక ప్రభుత్వ దవాఖానగా జీజీహెచ్కు పేరు వచ్చింది.
-డాక్టర్ జలగం తిరుపతిరావు, ప్రొఫెసర్, మెడికల్ కళాశాల, నిజామాబాద్
ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం
నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలో ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రభుత్వ దవాఖానలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులు కల్పించింది. రాష్ట్రంలో నిజామాబాద్ దవాఖానకు అరుదైన గౌరవం దక్కింది. పేదల కోసమే వైద్యులు పని చేస్తున్నారు. మల్టీ స్పెషాలిటీ వైద్యులు అదనంగా 27 మంది వచ్చారు.
-ప్రతిమారాజ్, సూపరిటెండెంట్, జీజీహెచ్, నిజామాబాద్
జీజీహెచ్ సేవలు.. రికార్డులు