వేల్పూర్, సెప్టెంబర్ 23 : స్వరాష్ట్రంలోనే పల్లెల్లో అసాధారణ అభివృద్ధి జరిగిందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సొంత స్థలం ఉండి ఇండ్లు లేని పేదలకు విడుతల వారీగా గృహలక్ష్మి కింద రూ. 3 లక్షలు అందజేస్తామని పేర్కొన్నారు. వేల్పూ ర్ మండలం అంక్సాపూర్, పడగల్ గ్రామాల్లో సుమారు రూ.17 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శనివారం మంత్రి శంకుస్థాపన చేశారు. అంతకుముందు అంక్సాపూర్, పడగల్లో మం త్రికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అంక్సాపూర్ సంత మల్లన్న దేవాలయాన్ని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన సభల్లో మంత్రి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతో ఊర చెరువులు కళకళ లాడుతున్నాయన్నారు. అభివృద్ధి, పాడి పంటలు, కులవృత్తులకు చేయూతతో గ్రామాలు సంబురంగా మారాయన్నారు.
కేసీఆర్ సంపద సృష్టించి పేదలకు పంచుతున్నాడన్నారు.అంక్సాపూర్, పడిగెల్ గ్రా మాభివృద్ధి చూస్తుంటే తనకు ఎంతో ఆనందం కలుగుతుందన్నారు. తాను చిన్నప్పుడు సైకిల్ మీద తిరిగిన మట్టి రోడ్డు ఎమ్మెల్యే అయ్యాక డాంబర్ రోడ్డు అయ్యిందని ఇప్పుడు డబుల్ రోడ్డు అవుతుందన్నారు. ఒకప్పటి, ఇప్పటి అంక్సాపూర్ గ్రామాన్ని చూస్తుంటే ఎంతో సంతోషం కలుగుతుందని, ఇంతకు మించి ఆత్మ తృప్తి మరోటి ఉండదన్నారు. ఈ ఒక్క గ్రామంలోనే రూ. 39 కోట్లతో అభివృద్ధి చేశామని తెలిపారు. 750 మందికి రూ.11 కోట్ల పెన్షన్లు ఇస్తున్నామన్నారు. రూ.36వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసిన ఘనత ఒక్క కేసీఆర్కే దక్కుతుందన్నారు. దేశంలోని ఏ సీఎం ఇంత సాహసం చేయలేదన్నారు.
రైతుబంధులాంటి పథకంతో రైతులకు ఆర్థిక భరోసా ఇవ్వాలనే కనీస ఆలోచన ఏ నాయకుడూ చేయలేదన్నారు. కానీ ఇప్పుడు తాము కేసీఆర్ కన్నా ఎక్కువ చేస్తామని అర్రాసు పాట తీరుగా పథకాలు ప్రకటిస్తున్నారని కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. కేసీఆర్వి గట్టి చేతలు, కాంగ్రెస్వి ఉట్టి మాటలని అన్నారు. రామ-రావణ యుద్ధం లో మిగిలిన రాక్షసులు కొంతమంది మనిషి రూపంలో గ్రామాల్లో ఇంకా తిరుగుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల కథ కూడా ఎంపీ అర్వింద్ బాండ్ పేపర్ లాంటి ఉత్తి మాటేనని విమర్శించారు. కేసీఆర్కు తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యమని చెప్పారు.
ఓట్ల కో సం మాయమాటలు చెప్పే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోస పడ్డ జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్కు అండగా నిలువాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్చైర్మన్ రమేశ్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కోటపాటి నర్సింహానాయుడు, ఆర్డీవో వినోద్కుమార్, ఏసీపీ జగదీశ్ చందర్, ఎంపీపీ బీమా జమున, జడ్పీటీసీ అల్లకొండ భారతి, సర్పంచులు రాజేశ్వర్రెడ్డి, దేవతి వర్ధిణి రాజకుమార్, ఉప సర్పంచులు రిక్క మధు, యాల్ల శ్రీనివాస్రెడ్డి, సొసైటీ చైర్మన్ హన్మంత్రెడ్డి, గుణాల రంజిత్, మిట్టాపల్లి మహిపాల్, గ్రామ కమిటీ సభ్యులు, సంత మల్లన్న ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.హరీశ్వర్రెడ్డి మృతి పట్ల మంత్రి వేముల సంతాపంపరిగి మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్రెడ్డి మృతి పట్ల మంత్రి వేముల సంతాపం వ్యక్తంచేశారు.