జక్రాన్పల్లి, సెప్టెంబర్ 25: ప్రతి గ్రామంలో రూ. 10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. సోమవారం ఆయన మండలంలోని జక్రాన్పల్లితోపాటు కేశ్పల్లి, సికింద్రాపూర్, బాల్నగర్ గ్రామాల్లో రూ. 20 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ. 2.50 కోట్లతో చేపట్టనున్న 44వ వంబర్ జాతీయ రహదారి నుంచి మునిపల్లి గ్రామం వరకు వయా నల్లగుట్ట తండా, నడిమి తండా బీటీ రోడ్డు రెన్యువల్, రూ. 4 కోట్లతో జాతీయ రహదారి నుంచి కలిగోట్ ఎక్స్ రోడ్డు వయా జక్రాన్పల్లి, మనోహరాబాద్, జక్రాన్పల్లి మండల కేంద్రంలో సెంట్రల్ మీడియన్ అండ్ సెంట్రల్ లైటింగ్తోపాటు నాలుగు వరుసల బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.కోటీ 83 లక్షలతో కేశ్పల్లి గ్రామంలో 44వ నంబర్ ఎన్హెచ్ నుంచి కేశ్పల్లి బీటీ రోడ్డు రెన్యువల్ తదితర పనులకు శంకుస్థాపనచేశారు.
బాలనగర్లో మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో కోట్ల రూపాయలతో సీసీ, బీటీ రోడ్లు, డ్రైనేజీలు, కుల సంఘాల భవనాలు నిర్మించినట్లు తెలిపారు. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలని కోరా రు. ప్రతిపక్ష నాయకుల మాయ మాటలు నమ్మొద్దని సూచించారు. మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలుకావడంలేదని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రతిపక్ష నాయకు లు అసత్య ప్రచారాలు చేసుకుంటూ దగ్గరికి వస్తున్నారని అన్నారు. వారి మాటలు నమ్మకుండా తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఎంపీపీ కుంచాల విమలారాజు, జడ్పీటీసీ తనుజా శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీ పీ మాస్కు తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.