Kamareddy | కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సరంపల్లి శివారులోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థికి మంగళవారం పాముకాటు వేసింది. ప్రస్తుతం ఆ విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉంది. స్థానికుల కథనం ప్రకారం.. గాంధారి మండలం జెమిని తండాకు చెందిన బానోత్ చరణ్ పదో తరగతి చదువుతున్నాడు.
కాగా టీ బ్రేక్ సమయంలో చరణ్ పాఠశాల మైదానంలోకి వచ్చినప్పుడు కాలు పైన పాము కాటు వేసింది. గమనించిన పాఠశాల సిబ్బంది జిల్లా కేంద్రంలోని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బాలుడిని పరీక్షించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.