బాన్సువాడ/బాన్సువాడ రూరల్/నస్రుల్లాబాద్/ వర్ని/ చందూర్/కోటగిరి, నవంబర్ 21: బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతుగా బాన్సువాడ, బీర్కూర్, బాన్సువాడ రూరల్, నస్రుల్లాబాద్, కోటగిరి, రుద్రూర్, వర్ని, చందూర్ మండల కేంద్రాలతోపాటు గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జోరుగా ప్రచారం నిర్వహించారు. బాన్సువా డలో స్పీకర్ పోచారం కూతురు అరుణారెడ్డి, కోడలు సోనిరెడ్డి ఇంటింటికీ వెళ్లి ఓట్లను అభ్యర్థిం చారు. కారు గుర్తుకు ఓటు వేసి పోచారాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గంగాధర్, నాయకులు జలపతిరెడ్డి, జడ్పీటీసీ పద్మాగోపాల్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అనిత, ఇందిరారెడ్డి, పత్తి శ్రీకాంత్, రాజశేఖర్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. కద్లాపూర్లో ఎంపీపీ దొడ్ల నీరజారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. కోనాపూర్లో ఏఎంసీ చైర్మన్ నెర్రె నర్సింహులు, సంగోజీపేట్, హన్మాజీపేట్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు.
బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షు డు మోహన్నాయక్ పులికుచ్చతండా, పులిగుం డు తండా, సోమ్లానాయక్తండాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నాయకులు దొడ్ల వెంకట్రాంరెడ్డి, గంగుల గంగారాం, సంగ్రాంనా యక్, గోపాల్రెడ్డి, సుధాకర్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, శ్రావణి, దేవేందర్రెడ్డి, మన్నె సాయిలు, ప్రశాంత్ కుమార్, భూనేకర్ ప్రకాశ్, జెట్టి హన్మాండ్లు, కొండ శ్రీశైలం, జిన్న రఘు, మల్లారెడ్డి, కుమ్మరి రాజు తదితరులు పాల్గొన్నారు. నస్రుల్లాబాద్లో నిర్వహించిన ప్రచారంలో బీఆర్ఎస్ నస్రుల్లాబాద్ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షుడు కంది మల్లేశ్, నాయకులు మైశాగౌడ్, నర్సింహులు గౌడ్, అజ్గర్ అలీ, మోసిన్, రాంబాబు, కలీల్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. కోటగిరి, పొతంగల్ మండలాల్లో ప్రచారం నిర్వహించారు. వర్ని మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పోచారానికి మద్దతుగా మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మోస్రా మండలంలో పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ వద్దకు ర్యాలీగా తరలివెళ్లారు. ర్యాలీలో బీఆర్ఎస్ నాయకులు రంజ్యానాయక్, కల్లాలి గిరి, రమేశ్ గౌడ్ పాల్గొన్నారు. మోస్రా మండలంలోని తిమ్మాపూర్, చింతకుంట, గోవూర్, దుబ్బా తండా, మోస్రా గ్రామాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రచారం నిర్వహించారు.
కోటగిరి, నవంబర్ 21 : బాన్సువాడ నియోజకవర్గంలోని పొతంగల్ మండలం కొడిచెర్ల గ్రామానికి చెందిన ఎస్సీ మాదిగ, గంగపుత్ర సంఘం సభ్యులు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని మంగళవారం కలిశారు. కారు గుర్తుకే ఓటు వేస్తామని, తమ పూర్తి మద్దతు ఉంటుందని వారు తెలిపారు. ఎస్సీ మాదిగ, గంగపుత్ర సంఘం సభ్యులు కలిసి తీర్మాన పత్రాన్ని పోచారానికి అందజేశారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తారని వారు తెలిపారు. కార్యక్రమంలో మువ్వ మున్నీ, మల్లేశ, కేశవ్ పాల్గొన్నారు.