డిచ్పల్లి/బాల్కొండ/భీమ్గల్/వేల్పూర్, డిసెంబర్ 9 : టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా రూపాంతరం చెంది అధికారికంగా గుర్తింపు దక్కడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు శుక్రవారం సంబురాలు జరుపుకొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎలక్షన్ కమిషన్ రాజముద్ర వేయడాన్ని హర్షిస్తూ పటాకులు కాల్చి, స్వీట్లు తినిపించుకొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాల ఎదుట బీసీ జేఏసీ, టీఆర్ఎస్వీ సంయుక్త ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించి స్వీట్లు పంచిపెట్టారు.
విద్యార్థి సంఘాల నాయకులు శ్రీనివాస్గౌడ్, యెండల ప్రదీప్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్కు జాతీయ పార్టీ హోదాను కల్పిస్తూ ఎలక్షన్ కమిషన్ ఆమోద ముద్ర వేయడం శుభపరిణామమన్నారు. ఇక నుంచి దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ ప్రత్యక్ష పాత్ర పోషించబోతున్నారని అన్నాను. బీఆర్ఎస్కు దేశవ్యాప్తంగా ప్రజలు పట్టం కట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో టీయూ అకడమిక్ కన్సల్టెంట్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ దత్త హరి, జ్యోత్స్న, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బాల్కొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను అధ్యక్షుడు బద్దం ప్రవీణ్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో ప్రధాన రోడ్లపై పటాకులు కాల్చారు.
భీమగల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఆపార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పటాకులు కాల్చారు. జడ్పీటీసీ చౌట్పల్లి రవి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మోయిజ్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కన్నే సురేందర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ శర్మనాయక్, వివిధ గ్రామాల సర్పంచులు తిరుపతి, రాములు, నర్సయ్య, ఎంపీటీసీలు సుర్జీల్, సాయి ప్రసన్న, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వేల్పూర్ మండలంలోని వేల్పూర్, మోతె, పడిగెల్, పచ్చలనడ్కుడ, అంక్సాపూర్ తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు సంబురాలు నిర్వహించుకున్నారు. మోతెలో పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు.