కంఠేశ్వర్, ఫిబ్రవరి 12: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్డెవలప్మెంట్(నాబార్డు) సహకారంతో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషనల్ సెల్ ఆధ్వర్యంలో వన్ డిస్ట్రిక్ట్-వన్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు టీఎస్ఐసీ పీఆర్ మేనేజర్ బుద్ధవరపు వాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్ట్గా రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో నిర్వహిస్తుండగా, నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 15 నుంచి 17 వరకు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు.