Nizamabad | వినాయక నగర్, జూన్ 8 : నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాధితుల సమస్యలపై నిర్వహిస్తున్న పోలీస్ ప్రజావాణి కార్యక్రమంలో 13 ఫిర్యాదులు స్వీకరించినట్లు నిజామాబాద్ అదనపు డిసిపి(అడ్మిన్) శుభం ప్రకాష్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కామారెడ్డి ఎస్పీ, నిజామాబాద్ ఇన్చార్జి సీపీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు నిజామాబాద్ అదనపు బాధితుల ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు.
చట్టపరమైన చర్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు అవసరమైన సూచనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితుల సమస్యలను నేరుగా పోలీస్ అధికారికి చెప్పుకునేందుకు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఈ పోలీస్ ప్రజావాణి కొనసాగించినట్లు వెల్లడించారు. బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించి వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్వోలు, సీఐలను ఫోన్లో ఆదేశించారు. అంతేకాకుండా బాధితులు మూడో వ్యక్తితో పని లేకుండా నేరుగా ఇక్కడికి వచ్చి తమ సమస్యలపై ఫిర్యాదు చేసే అవకాశం ఉందని అదనపు డీసీపీ శుభం ప్రకాష్ వెల్లడించారు.