దోమకొండ, ఫిబ్రవరి 1: దోమకొండ మండల కేంద్రంలో మనఊరు- మనబడి నిధులతో ఆధునీకరించిన పలుగడ్డ ప్రాథమిక పాఠశాలను జడ్పీటీసీ తిర్మల్గౌడ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ శారద, గండ్ర మధుసూదన్రావు, సర్పంచ్ అంజలి, శ్రీనివాస్, విండో చైర్మన్ నాగరాజురెడ్డి, కుంచాల శేఖర్, కడారి రమేశ్, నర్సారెడ్డి, శ్రీకాంత్ కిషన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.