బిచ్కుంద, ఫిబ్రవరి 1 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు సీఎం కేసీఆర్ భారీగా నిధులు కేటాయించి మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేస్తున్నారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. మండలంలోని పుల్కల్ పాఠశాలలో రూ. 4 లక్షల నిధులతో పూర్తిచేసిన అభివృద్ధి పనులను బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ.. సర్కారు బడులను అభివృద్ధి చేయడంతో ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిన గ్రామీణ ప్రాంత విద్యార్థులు తిరిగి ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు తీసుకుంటున్నారని గుర్తుచేశారు. ఉత్తమ బోధనతో మంచి ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు. హస్గుల్ గ్రామంలోని పాఠశాలను ఎంపీపీ అశోక్పటేల్ ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ భారతీరాజు, పుల్కల్, బిచ్కుంద సొసైటీల చైర్మన్లు రాంరెడ్డి, బాలాజీ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.