ఎదులాపురం/ నిర్మల్ టౌన్, జనవరి 26: ఆదిలాబాద్ జిల్లాలో 73వ గణతంత్ర దినోత్సవ సంబురాలు బుధవారం నిర్వహించారు. కొవి డ్ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఊరూ రా నిరాడంబరంగా కొనసాగాయి. ఉదయం 10 గంటలకు ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర చోట్ల జెండాలను ఎగురవేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సముదాయంలో జాతీయ జెండాను కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించే కృషి చేస్తామన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో కొవిడ్ మొదటి డోస్ జిల్లాలో వంద శాతం పూర్తి చేశామని చెప్పారు. పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, జిల్లా కోర్టు లో ప్రధాన న్యా యమూర్తి ఎం సునీత, ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో పీవో అంకిత్, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర్ ముషారఫ్ అలీ పారూఖీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం అధికారులు కృషి చేయాలన్నారు. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని కోరారు. అంతకు ముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. భైంసాలోని ఏరియా దవాఖానలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా ఊరూరా నిర్వహించిన జెండా పండుగలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.