లక్ష్మణచాంద, జూలై 3 : పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బం దీగా నిర్వహించాలని అధికారులకు అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే సూచించారు. మండలంలోని నర్సాపూర్ (డబ్ల్యూ), బాబాపూర్ గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను శనివారం ఆయన పరిశీలించారు. గ్రామంలో డంప్యార్డ్, నర్సరీని పరిశీలించా రు. బాబాపూర్ పంచాయితీ కార్యదర్శి సుధాకర్ విధులకు ఆలస్యంగా హాజరుకావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. విధులకు సకాలంలో హాజరు కాని వారిపై చర్యలు తప్పవన్నా రు. ఎంపీడీవో మోహన్, బాబాపూర్ సర్పంచ్ శ్రీవిద్య, నర్సాపూర్(డబ్ల్యూ) సర్పంచ్ కాహితి లలిత పాల్గొన్నారు.
అందరూ భాగస్వాములు కావాలి
దస్తురాబాద్, జూలై 3 : పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు భాగస్వాములు కావాలని మండల ప్రత్యేక అధికారి రాజేశ్వర ప్రసాద్ కోరారు. మండలంలోని ఆయా గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు, నర్సరీలు, రోడ్డుకు ఇరువైపులా కూలీలు నాటుతున్న మొక్కలను ఆయన పరిశీలించారు. గ్రామాలు శుభ్రంగా ఉంచాలన్నారు. మండల కేంద్రంలో రోడ్లపై గుంతలను ట్రాక్టర్ సాయం మొరం పోసి సర్పంచ్ పూడ్చివేశారు. సర్పంచ్ నిమ్మతోట రాజమణి, అప్పని ప్రభాకర్, అంజన్న, వార్డు మెంబర్లు, ఏపీవో రవి ప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హరితహారం
నిర్మల్ అర్బన్, జూలై 3 : పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా అధ్యాపకులు మొక్కలను నాటారు. కళాశాల ప్రిన్సిపాల్ బీమారావు మాట్లాడుతూ విద్యార్థులు నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని తెలిపారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఆర్ నాగేశ్వర్, రఘు గణపతి అధ్యాపకులు, తదితరులున్నారు.
లోకేశ్వరంలో..
లోకేశ్వరం, జూలై 3 : ధర్మోర, పంచగుడి, వటోలి, జోహర్ పూర్ గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు మొక్కలు నాటారు. అధికారులు వాడవాడలా పర్యటించారు. సర్పంచ్లు మంద శారద భాస్కర్, రజిత సాయన్న, మద్యల ఎల్లన్న, జడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, మండల ఉపాధ్యక్షుడు నారాయణ రెడ్డి, నాయకులు బాయమోల్ల భోజన్న, రాజేశ్ బాబు, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, మండల స్పెషల్ ఆఫీసర్ కిరణ్ కుమార్ ఎంపీడీవో గంగాధర్, ఏఈ శివప్రసాద్, విద్యుత్ శాఖ ఏపీవో, ఏపీఎం టెక్నికల్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు.
పెంబిలో..
పెంబి, జూలై 3: పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. మురుగు నీరు, చెత్త చెదారం తొలగించి రోడ్డు వెంట మొక్కలు నాటారు. సర్పంచ్లు పూర్ణ చందర్ గౌడ్, మహేందర్, సుధాకర్, ఉపస ర్పంచ్ స్వప్నిల్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.