బాసర : బాసర సరస్వతి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. 4వ రోజైన ఆదివారం సరస్వతి అమ్మవారు కుష్మాండ రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అర్చకులు ఆలయంలో సుహాసిని పూజ, మంత్రపుష్పం, చతుర్వేద పారాయణం, లలిత సహస్రనామాలు, నివేదన హారతి, తదితర పూజలను నిర్వహించారు. అమ్మవారికి అర్చకులు అల్లం వడలు నైవేద్యంగా సమర్పించారు. సరస్వతి అమ్మవారిని భక్తులు దర్శించుకొని ఆలయంలో ఉచితంగా నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.
దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ సోమవారం సరస్వతి అమ్మవారు స్కందమాత అవతారంలో భక్తులు దర్శనం ఇవ్వనున్నారు. మంగళవారం మూల నక్షత్రం కావడంతో బాసరకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.