సోన్ /మామడ: తెలంగాణ ఆడబిడ్డలకు ఆత్మగౌరవం అందించాలనే ఉద్దేశంతో బతుకమ్మ పండుగకు అందమైన చీరలను ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్నారని జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి అన్నారు. సోమవారం నిర్మల్ మండలంలోని డ్యాంగాపూర్, లంగ్డాపూర్, మేడిపెల్లి, కొండాపూర్, వెంగ్వాపేట్ గ్రామాల్లో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ చీరలతో బతుకమ్మ పండుగకు కొత్త సంప్రదాయం ఏర్పడిందని అన్నారు. అనంతరం డ్యాంగాపూర్ గ్రామంలో రూ. 2లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు.
కార్యక్రమంలో నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మదాముత్యంరెడ్డి, నిర్మల్ మండల కన్వీనర్ గోవర్ధన్రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్రావు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. సోన్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జడ్పీటీసీ జీవన్రెడ్డి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బర్ల మానస హరీశ్రెడ్డి, గ్రామ సర్పంచ్ వినోద్, ఎంపీడీవో సాయిరాం, బర్మ లక్ష్మిరాజనర్సయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ దాసు, తదితరులు పాల్గొన్నారు.