మెరుగైన వైద్య సేవలందించాలి

డీఎంఅండ్హెచ్వో నరేందర్
ఎదులాపురం : మెరుగైన వైద్యసేవలందించాలని ప్రభుత్వ వైద్యులు, సిబ్బందికి డీఎంఅండ్ హెచ్ఓ నరేందర్ రాథోడ్ ఆదేశించారు. ఆదివా రం జిల్లా కేంద్రంలోని (ఎన్హెచ్ఎం)లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న పథకాలను పవర్ పా యింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలుసుకున్నారు. కేసీఆర్ కిట్, కుటుంబ నియంత్రణ , టీబీ, కుష్ఠు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులకు అందుతున్న సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణులు, చిన్నపిల్లలు, క్రమం తప్పకుండా టీకాలు వేయించుకుంటున్నారా ? కేసీఆర్ కిట్ ఇస్తున్నారా ? డబ్బులు వారి అకౌంట్లో జమ అవుతున్నాయా ? అని తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందేలా చూడాలన్నారు. వైద్య సేవల్లో ఆదిలాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి శ్రీకాంత్, డాక్ట ర్ వైసీ శ్రీనివాస్, ఎన్హెచ్ఎం డీపీఎం స్వా మి, డీడీఎం వెంకటరమణ పాల్గొన్నారు.
తాజావార్తలు
- విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
- గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
- వ్యాక్సినేషన్పై అపోహలు వద్దు
- రూ.1,883 కోట్ల మద్యం తాగేశారు
- శివ నిస్వార్థ సేవలు అభినందనీయం
- ఆర్మీ ర్యాలీలో తెలంగాణ సత్తా చాటాలి
- పట్టణ వేదిక.. ప్రగతి కానుక
- లక్ష్యంపై గురి!
- దళిత రైతు కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు
- చంద్రబోస్ జయంతిని జయప్రదం చేయాలి