Dharmapuri Arvind | కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తాలిబన్ల రాజ్యం వస్తుందని బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ హెచ్చరించారు. శుక్రవారం జగిత్యాల జిల్లా మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. దేశభద్రత కోసం బీజేపీకి ఓటేయాలని కోరారు.
కాంగ్రెస్ రజాకార్ల పార్టీ అని, హిందూ ధర్మాన్ని అవహేళన చేయడమే వారి విధానమని ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. శ్రీరాముల అక్షింతల పంపిణీపై సీఎం రేవంత్రెడ్డి రాద్ధాంతం చేయడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను తీసివేసి మైనార్టీలకు ఇస్తారని తెలిపారు. గతంలో జీవన్రెడ్డి హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలతో కలిసి హిందూ ధర్మాన్ని కించపరిచి.. ఇప్పుడు హిందువుల ఓట్ల కోసం ప్రాధేయపడుతున్నాడని విమర్శించారు.