నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
మాస్డ్రగ్ అడ్మినిస్ట్రేషన్పై జిల్లా కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం
నిర్మల్ టౌన్, జూలై 12: జిల్లాలో అంటు వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్య శాఖ అ ధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారు లను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో మాస్డ్రగ్ అడ్మినిస్ట్రేషన్పై జిల్లా కో ఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పైలేరియా వ్యాధిని నిర్మూలించేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు. ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు మాస్డ్రగ్ అడ్మినిస్ట్రేషన్పై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. అన్ని పీహెచ్సీల్లో రోగులకు ఉచితం గా రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలని, వైరల్ జ్వరాల బారిన పడకుండా సేవలందించాలని కోరారు. సీజనల్ వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలను గు ర్తించి, నివారణ చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో సుధీర్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, డీఈవో ప్రణీత, డీటీడబ్ల్యూవో శ్రీనివాస్రెడ్డి, డీఎంఅండ్హెచ్వో ధన్రాజ్, వైద్యులు అరుణ్, తదితరులు పాల్గొన్నారు.