హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అందజేసే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కోసం దరఖాస్తు గడువును పొడిగించింది. కళాశాలలు, విద్యార్థులు ఎవరైనా సరే ఈ–పాస్ ద్వారా దరఖాస్తుకు గడువును మే 31 వరకు పొడిగిస్తున్నామని ఎస్సీ సంక్షేమశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, వికలాంగ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. గత ఏడాది అక్టోబర్ 14నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు 2,09,618 మంది దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. రెన్యువల్, కొత్త దరఖాస్తులకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందన్నారు. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు అధికారిక వెబ్సైట్ htt://telanganaepass.cgg.gov.in చూడాలని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి