హైదరాబాద్: తెలంగాణ ఓపెన్స్కూల్ సొసైటీ ఎస్సెస్సీ, ఇంటర్ వార్షిక పరీక్షలను జూలైలో నిర్వహించనున్నారు. పరీక్షల పూర్తి షెడ్యూల్ను త్వరలోనే విడుదలచేస్తామని సొసైటీ సంచాలకుడు ఏ సత్యనారాయణ రెడ్డి వెల్లడించారు. 19 నుంచి అపరాధ రుసుము లేకుండా మే 10 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.25 అపరాధ రుసుముతో మే 17 వరకు, రూ.50 అపరాధ రుసుముతో మే 24 వరకు ఫీజు చెల్లించవచ్చని వివరించారు. అభ్యర్థులు టీఎస్ ఆన్లైన్, మీసేవ కేంద్రాలు, డెబిట్, క్రెడిట్కార్డుల ద్వారా మాత్రమే ఫీజు చెల్లించాలని స్పష్టంచేశారు. కరోనా నేపథ్యంలో గతేడాది ఓపెన్ స్కూల్ పరీక్షలను రద్దుచేసి, అందరినీ 35 శాతం మార్కులతో పాస్చేశారు. ఈ ఏడాది పరిస్థితులను బట్టి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి