వరంగల్ రూరల్ : అకాల వర్షం జిల్లాలో బీభత్సం సృష్టించింది. కొన్నిచోట్ల వడగండ్ల వాన పడింది. రైతులు తమ కల్లాల్లో ఆరబోసిన యాసంగి ధాన్యం అకాల వర్షం వల్ల తడిసింది. పిడుగుపాటుతో వేర్వేరు గ్రామాల్లో ఇద్దరు మరణించారు. వర్ధన్నపేట మండలం నల్లవెల్లి గ్రామంలో మహిళ ఆరెల్లి కాంతమ్మ (45) చనిపోగా నడికూడ మండలం రాయపర్తి గ్రామంలో అర్చకుడు రవీంద్ర చారి (40) మృతి చెందాడు. ఈ దుర్ఘటనలతో రెండు గ్రామాల్లోనూ విషాదం నెలకొంది. పిడుగుపాటుతో కొన్ని గ్రామాల్లో చెట్లు ధ్వంసమైనట్లు తెలిసింది.
ఇవి కూడా చవండి..
రాష్ట్ర సరిహద్దుల్లో రెండు చెక్ పోస్టులు ఏర్పాటు
వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పువ్వాడ