ఖమ్మం : కొవిడ్ నివారణ చర్యల్లో భాగంగా భక్త రామదాస్ కళాక్షేత్రంతో కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సందర్శించారు. కొవిడ్ నివారణకు తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రెండో డోస్ వేసుకునే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని వైద్య సిబ్బందికి సూచించారు.
మంత్రి వెంట ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, మేయర్ నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, సుడా చైర్మన్ విజయ్, డీఎంహెచ్వో మాలతి, కార్పొరేటర్లు తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చవండి..
ఇళయరాజా సోదరుడి సతీమణి కన్నుమూత
ఇళయరాజా సోదరుడి సతీమణి కన్నుమూత