దుండిగల్: ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్టుకు ఇండియా 350 రన్స్ టార్గెట్ ఇచ్చింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ జట్టు నిర్ణీత 49 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 349 రన్స్ చేసింది. భారత జట్టులో ప్రభుసిమ్రన్ సింగ్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మలు హాఫ్ సెంచరీ నమోదు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ అబ్దుల్లా అహ్మద్జాయి అయిదు వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో ఫస్ట్ టాస్ గెలిచిన ఆఫ్ఘన్ జట్టు ఇండియాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. అయితే యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆరంభం నుంచే షాట్లతో చెలరేగిపోయాడు. అతను కవేలం 22 బంతుల్లో 44 రన్స్ చేశాడు.
భారీ ఇన్నింగ్స్ ఆడబోతున్నట్లు కనిపించి వైభవ్ అనూహ్యంగా ఔటయ్యాడు. మరో ఓపెనర్ ప్రభుసిమ్రన్ అత్యధికంగా 84 రన్స్ చేశాడు. మిడిల్ ఆర్డర్లో రుతురాజ్, తిలక్ వర్మ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నాలుగో వికెట్కు 78 రన్స్ జోడించారు. అయితే లోయర్ మిడిల్ ఆర్డర్లో సూర్యాంశ్ షెడ్జ్ 27 బంతుల్లో 40 రన్స్ చేసి భారత స్కోరు బోర్డును పరుగెత్తించాడు. ముక్కోణపు సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్లో ఇండియా నెగ్గిన విషయం తెలిసిందే.
Innings Break!
India A put up a strong total of 3️⃣4️⃣9️⃣/9 against Afghanistan A 💪
Prabhsimran Singh led the charge with 8️⃣4️⃣(69) 👏
Scorecard ▶️ https://t.co/dMNsGrzIOD#INDAvAFGA | #TriNationSeries
(Image credit: Sri Lanka Cricket) pic.twitter.com/7tRDz6cgyS
— BCCI (@BCCI) June 11, 2026