జోగులాంబ గద్వాల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రైలు ఇంజన్ ఢీ కొని ఓ మహిళ మృతి చెందింది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. ఇటిక్యాల మండలం పెద్దదిన్నె గ్రామంలో రైలు ఇంజన్ ఢీకొని గ్రామానికి చెందిన బోయ గోవిందమ్మ (65 మృతి చెందింది. గ్రామపంచాయతీ కార్యాలయంలో రేషన్ బియ్యం తీసుకొని రైల్వే ట్రాక్ దాటి ఇంటికి వెళ్లే క్రమంలో.. రేషన్ కార్డు మరిచి పోయానని ఆతృతగా రైల్యే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించింది.
ఈ క్రమంలో కర్నూల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇంజన్ ఢీ కొట్టగా అక్కడికక్కడే మృతి చెందింది. రైల్వే పోలీస్ రామకృష్ణ పంచనామా నిమిత్తం గద్వాల్ ఏరియా దవాఖానకు మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.