కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ రోజుకు కొన్ని వేల మంది చనిపోతున్నారు. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా మృత్యుబాట పడుతున్నారు. కొందరు కరోనా వలన మరణిస్తుంటే, మరి కొందరు అనారోగ్యంతో తుదిశ్వాస విడుస్తున్నారు. తాజగా మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సోదరుడు గంగై అమరణ్ సతీమణి మణిమేఖలై కన్నుమూశారు. 69 ఏళ్ల వయస్సులో ఆమె కన్నుమూయడం కుటుంబ సభ్యులని ఆవేదనకు గురి చేసింది.
సినీ దర్శకుడు, సంగీత దర్శకుడు, గాయకుడు, పాటల రచయిత అయిన గంగై అమరన్ కాగా, ఆయన తనయులు వెంకట్ ప్రభు దర్శకుడిగా పని చేస్తున్నారు. మరో కుమారుడు ప్రేమ్ జీ నటుడు , సంగీత దర్శకుడిగా ఉన్నారు. అయితే గంగై అమరణ్ కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు తెలుస్తుంది. ఆమె మృతికి కోలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.