న్యూఢిల్లీ: రాజస్థాన్లోని కోటా కేంద్రంగా పనిచేస్తున్న వెస్ట్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను భారతీయ రైల్వే ఆహ్వానిస్తున్నది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 30 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఎంపికైనవారు కోటా డివిజన్లో పనిచేయాల్సి ఉంటుందని తెలిపింది.
మొత్తం ఖాళీలు: 716
ఇందులో ఎలక్ట్రీషియన్ 135, ఫిట్టర్ 102, వెల్డర్ 43, పెయింటర్ 75, మేసన్ 61, కార్పెంటర్ 73, ప్లంబర్ 58, బ్లాక్స్మిత్ 63, వైర్మ్యాన్ 50, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ 10, మెషినిస్ట్ 5, టర్నర్ 2, ల్యాబ్ అసిస్టెంట్ 2, క్రేన్ అసిస్టెంట్ 2, డ్రాఫ్ట్స్మెన్ 5 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ట్రేడ్లో ఐటీఐ చేసి, 15 నుంచి 24 ఏండ్లలోపు వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక విధానం: ఐటీఐ, పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.170, ఎస్టీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 30
వెబ్సైట్: wcr.indianrailways.gov.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..