న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ఒకే కేవైసీ అమలుపై కసరత్తు జరుగుతున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం తెలిపారు. ‘ఒక్కసారి కేవైసీ ఇచ్చినట్టయితే అది అన్నిచోట్ల, అన్ని సందర్భాల్లో పనికొచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని ఇక్కడ జరిగిన ఫిక్కీ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ చెప్పారు. దీనివల్ల బ్యాంక్ ఖాతా తెరిచేందుకు, కొత్త పెట్టుబడులు పెట్టేందుకు, డీమ్యాట్ ఖాతా తదితర అవసరాల కోసం పదేపదే కేవైసీని సమర్పించాల్సిన అవసరం ఉండబోదన్నారు. దేశంలో వ్యాపా ర నిర్వహణ కూడా సులభతరం కాగలదని మంత్రి అభిప్రాయపడ్డారు. నిజానికి ఆర్థిక రంగ రెగ్యులేటర్లతో గతవారం జరిగిన సమావేశంలోనూ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, క్యాపిటల్ మార్కెట్ల కోసం ఒకే కేవైసీ అంశం చర్చకు వచ్చినట్టు నిర్మల తెలియజేశారు.