కంఠేశ్వర్, ఏప్రిల్ 28 : పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈ నెల 18న మొదలైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చివరి అంకానికి చేరుకున్నది. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి మొత్తం 42 మంది అభ్యర్థులు 90 నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 26న నిర్వహించిన స్క్రూటినీలో 10 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. నేడు (సోమవారం) నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ కావడంతో ఎంతమంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటారో, ఎంతమంది ఎన్నికల బరిలో నిలుస్తారో తేలనున్నది.