కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలోని షంషేర్గంజ్ ప్రాంతంలో సోమవారం 14 బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 17న రాష్ట్రంలో ఐదో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు ముందు ఘటన చోటు చేసుకుంది. ఇంతకు ముందు పలు చోట్ల పెద్ద ఎత్తున బాంబులను, తయారీ పరికరాలను, గన్ పౌడర్, బుల్లెట్లను పట్టుకున్నారు. నాలుగో విడుత ఎన్నికల సందర్భంగా నానూర్ గ్రామంలో ప్రభుత్వ కమ్యూనిటీ హాల్లో 200 బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకొని, నిర్వీర్యం చేశారు. అయితే ఎన్నికల సమయంలో ఇలా బాంబులు బయటపడుతుండడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొంటున్నాయి.
ఇదిలా ఉండగా.. ఈ నెల 10న నాలుగో విడుత ఎన్నికల సందర్భంగా కూచ్ బెహార్ జిల్లాలో హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటన తర్వాత స్పెషల్ అబ్జర్వర్ల మధ్యంతర నివేదిక ఆధారంగా 126 పోలింగ్ స్టేషన్ పరిధిలో వాయిదా వేయాలని ఈసీ ఆదేశించింది. ఘటనపై సమగ్ర నివేదికను కోరింది. ఘటన చోటు చేసుకున్నప్పటి నుంచి ఏ రాజకీయ పార్టీకి చెందిన నాయకులు ప్రవేశించకుండా కూచ్ బెహార్ జిల్లాలో ప్రవేశించకుండా 72 గంటల పాటు నిషేధం విధించింది. 294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో ఎనిమిది విడుతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నాలుగు విడుతల ఎన్నికలు ముగియగా.. ఈ నెల 17న ఐదో దశ, 22న ఆరోదశ ఎన్నికలు జరుగనున్నాయి. మే 2న ఫలితాలుప్రకటించనున్నారు.