నర్సంపేట రూరల్/చెన్నారావుపేట, అక్టోబర్ 4: రాష్ట్ర ప్రభుత్వం గొల్ల, కుర్మలకు రెండో విడత గొర్రెల పంపిణీకి బదులు నగదు బదిలీపై గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం (జీఎంపీఎస్) జిల్లా కార్యదర్శి పరికి మధూకర్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం మండలంలోని ముగ్దుంపురంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈపథకాన్ని పక్కాగా అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కుండె లింగస్వామి, కొమ్మ బాలకొంరయ్య, కొమ్మ రాజు, అమ్మ రాంచంద్రు, కొమ్మ చిన్న కొండయ్య, కంచె రాములు, ఎగ్గెడి రాజ్కుమార్, పైడిపల్లి కొంరయ్య, అయిలయ్య, అశోక్, నరేందర్, సంతోశ్, సారయ్య, అజయ్ తదితరులున్నారు.
నగదు బదిలీతో మేలు
గీసుగొండ : గొర్రెల పంపిణీలో ప్రభుత్వం లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ విషయమన్నారు. మండలంలోని గంగదేవిపల్లిలో మంగళవారం జరిగిన గొర్రెల మేకల పెంపకదారుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మల్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులందరికీ నగదును వారి ఖాతాల్లో జమ చేయాలని కోరారు. గొర్రెల పంపిణీలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సారంగం, కొమురయ్య, కుమారస్వామి, మల్లేశం, రాములు, సూర్య తదితరులు పాల్గొన్నారు.