వనపర్తి, ఏప్రిల్ 16(నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు ఓటర్లు తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. గతంలో ఎంపీలుగా గెలిచిన వారు నాగర్కర్నూల్ పార్లమెంట్ను ఏమాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. మంగళవా రం రాత్రి వనపర్తిలోని హరిజనవాడ, రాజీవ్ చౌర స్తా కూడళ్లలో కార్నర్ మీటింగ్లు నిర్వహించగా బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్తో కలిసి నిరంజన్రెడ్డి పాల్గొని ప్రసంగించా రు. ప్రాంతీయ పార్టీలున్న రాష్ర్టాల్లోనే గణనీయమైన అభివృద్ధి జరిగిందన్నారు. రాజకీయ లబ్ధి కోసమే కేం ద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ అంటూ జాతీ య పార్టీలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయన్నా రు. ఓటర్లు కాంగ్రెస్, బీజేపీలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. అత్యంత ప్రతిభ కలిగిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను గెలిపించి ఓటర్లు విజ్ఞతను చాటుకోవాలని సూచించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఓటర్లు మోసపోవద్దని, ఆలోచించి ఓటు వేయాలని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. నాడు డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పి నేడు ఆగస్టులో అంటూ మాట మార్చి రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 40మంది ఆటో డ్రైవర్లు చనిపోయారని, వారి కుటుంబాలను సర్కారు పరామర్శించలేదన్నారు. ఇక్కడి ప్రస్తుత ఎంపీ 289 రోజుల్లో కేవలం 6 నిమిషాలు మాత్ర మే పార్లమెంట్లో మాట్లాడారని, ఇలాంటి వ్యక్తుల వల్ల పేదలకు ఏం మేలు జరుగుతుందని ప్రశ్నించా రు. ఓటర్లు తనకు అవకాశమిస్తే నాగర్కర్నూల్ను అభివృద్ధిలో దేశంలోనే ప్రథమస్థానంలో నిలబెడతానన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, నాయకులు అభిలాష్రావు, వాకిటి శ్రీధర్, లక్ష్మయ్య, నందిమళ్ల అశోక్కుమార్, నరేశ్కుమార్, రమేశ్గౌడ్, తిరుమల్, రఘువర్ధన్రెడ్డి, మాధవ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.