న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. సెమీ స్టేట్ పుదుచ్చేరి సహా పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాల్లో ఇవాళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్నది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఒకే విడుతలో ఇవాళ పోలింగ్ నిర్వహిస్తుండగా, అసోంలో మూడు దశల ఎన్నికల్లో భాగంగా ఇవాళ తుదివిడుత పోలింగ్ కొనసాగుతున్నది. పశ్చిమబెంగాల్లో 8 దశల ఎన్నికల్లో భాగంగా ఇవాళ మూడో విడుత పోలింగ్ జరుగుతున్నది.
అయితే, మధ్యాహ్నం 12 గంటల వరకు తమిళనాడు మినహా అన్ని రాష్ట్రాల్లో 30 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. అసోంలో 33.18 శాతం, కేరళలో 31.62 శాతం, పుదుచ్చేరిలో 35.71 శాతం, తమిళనాడులో 22.91 శాతం, పశ్చిమబెంగాల్లో 34.71 శాతం పోలింగ్ జరిగినట్లు ఈసీ అధికారులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణను నియమించిన రాష్ట్రపతి
తమిళనాడులో ఓటేసిన గవర్నర్ తమిళిసై
ఓటు వేసిన డీఎంకే చీఫ్ స్టాలిన్
తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా కేసులు
పోలింగ్ బూత్లో పేలిన నాటు బాంబు
యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలను చంపేస్తాం.. సీఆర్పీఎఫ్కు మెయిల్