అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి సతీమణి వైఎస్ భారతి (YS Bharati) పై వివేకానంద కూతురు సునీత (Sunitha) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. పులివెందులలో సింగిల్ప్లేయర్గా ఉండేందుకు వివేకాను హత్య చేశారని ఆరోపించారు. వైఎస్ అవినాష్ జగన్కు ఎదురించి మాట్లాడే సత్తా ఉందని అన్నారు.
ప్రస్తుతం ఎన్నికల్లోనూ సింగిల్ ప్లేయర్గా అవినాష్రెడ్డి(Avinash reddy) ఒక్కరే ఉండాలంటే భారతి నన్ను, షర్మిలను నరికేస్తారో తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు. వివేకాను అదేవిధంగా చంపివేశారని ఆరోపించారు. వివేకా హత్య కేసు తేల్చేందుకుగాను అన్నింటికి తెగించి ముందుకు వచ్చానని, ప్రాణహాని ఉన్నందున ముందు జాగ్రత్తగా విలునామను నా పిల్లలకు రాసిస్తున్నానని పేర్కొన్నారు.
తమకు ప్రాణహాని ఉందని సీబీఐ, పోలీసులకు కూడా తెలుసని అన్నారు. తమ కుటుంబానికి భద్రత లేనందున రక్షణ పెంచుకోవాలని స్థానిక పోలీసులు కూడా సూచిస్తున్నారని తెలిపారు.