హైదరాబాద్ : నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివ్ధకి నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఉప్పల్(Uppal) ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Bandari Lakshmareddy)పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని సోనియగాంధీనగర్ ఫేజ్1 నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని కాలనీలలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
సోనియగాంధీనగర్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. అనంతరం కాలనీ నూతన కమిటీ సభ్యులు శ్యామల భిక్షపతి, పలుగుల గోపాల్, తాండ్ర యాదగిరి, మైలారం బాల్నర్సింహ్మ, రాజుగౌడ్, శ్రీనివాస్రెడ్డిలతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పజ్జూరి పావనీమణిపాల్రెడ్డి, సింగిరెడ్డి ధన్పాల్రెడ్డి, నాయకులు నేమూరి మహేశ్గౌడ్, వంశరాజు మల్లేశ్, ఇస్లావత్ హరినాయక్, సీసీఎస్ ప్రతినిధి ఎంపెల్లి పద్మారెడ్డి, సీతారామిరెడ్డి, రాములు యాదవ్, పలుగుల మహేందర్, బాల్నర్సింహ్మగౌడ్, సిద్దుగౌడ్, దామోదర్రెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు.