న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి ప్రస్తుతం వ్యాక్సినే కీలక ఆయుధం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు అగ్ర దేశాల్లో టీకాల పంపిణీ ముమ్మరంగా సాగుతున్నది. చాలా దేశాల్లో ఇప్పటికే రెండు మోతాదుల వ్యాక్సిన్ పంపిణీ పూర్తయ్యింది. అయితే, పేద దేశాల్లో టీకాల పంపిణీ సక్రమంగా సాగడం లేదు. ప్రస్తుతం పలు దేశాల్లో మళ్లీ వైరస్ విజృంభిస్తుండడంతో అగ్రరాజ్యాలు మరోసారి తమ ప్రజలకు బూస్టర్ డోస్ (టీకా మూడో మోతాదు) ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డోస్ రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారు మూడో డోస్ విషయంలో మాత్రం తొందర పడొద్దని సూచించింది. సెప్టెంబర్ వరకు వాయిదా వేసుకోవాలని, ముందుగా అన్ని దేశాల్లో పది శాతం ప్రజలకు రెండు డోసులు అందేలా చూడాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది.
అయితే, ఈ విజ్ఞప్తిని అగ్రరాజ్యాలు పట్టించుకోవడం లేదు. తమ దేశ ప్రజలకు బూస్టర్ డోసు వేసేందుకు అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇజ్రాయెల్లో బూస్టర్ డోస్ వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. డబ్యూహెచ్ విజ్ఞప్తి తర్వాత ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సెప్టెంబర్ నుంచి వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి బూస్టర్ డోసు వేయనున్నట్లు ప్రకటించారు. జర్మనీ సైతం 60 ఏళ్లుపైబడిన వారికి మూడో మోతాదు అందజేస్తామని స్పష్టం చేసింది. ప్రాణాంతక వైరస్ నుంచి ప్రజలను కాపాడుకునేందుకు చేయగలిగినంత వరకు చేస్తానని జర్మనీ హెచ్ఓ చెప్పారు. ప్రపంచంలోని పేద దేశాలకు 30 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్ విరాళంగా అందించినట్లు ప్రకటించారు.