న్యూఢిల్లీ : ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్కు ఉత్తరప్రదేశ్ పోలీసులు లీగల్ నోటీసు పంపారు. వారం రోజుల్లోగా లోనీ బోర్డర్ పోలీస్స్టేషన్కు వచ్చి వివరణ ఇవ్వాలని ట్విట్టర్ మేనేజింగ్ డైరెక్టర్ మనీశ్ మహ్వేశ్వరిని ఆదేశించారు. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ముస్లిం వ్యక్తిపై జరిగిన దాడి విషయంలో ‘మతపరమైన అశాంతిని రెచ్చగొట్టినందుకు’ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సూఫీ అబ్దుల్ సమద్ అనే వ్యక్తి తనపై దాడి చేసిన ముఠా ‘వందేమాతరం, జై శ్రీరాం’ నినాదాలు చేశారని ఆరోపించారు. అయితే, ఈ సంఘటనలో మతపరమైంది ఏమీ లేదని యూపీ పోలీసులు చెబుతున్నారు.
నకిలీ యంత్రాలు విక్రయించారే కోపంతో సదరు వ్యక్తిపై ఆరుగురు దాడి చేశారని, ఇందులో హిందువులు, ముస్లింలు సైతం ఉన్నారని పేర్కొన్నారు. అయితే, దాడి ఆరోపణలకు సంబంధించిన వీడియోను కొందరు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. థర్డ్ పార్టీ కంటెంట్ను కలిగి ఉందని, దాన్ని తొలగించలేదంటూ పోలీసులు ఇటీవల కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో పలువురు జర్నలస్టులు, కొందరు నాయకులపై సైతం ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇదిలా ఉండగా.. గత నెలలో ఢిల్లీ స్పెషల్ పోలీసుల బృందం ‘కాంగ్రెస్ టూల్కిట్’ వ్యవహారంలో మనీశ్ మహేశ్వరిని ప్రశ్నించింది.