న్యూఢిల్లీ : దేశంలోని మూడు రాష్ట్రాల్లో భూమి కంపించింది. అసోం, మణిపూర్, మేఘాలయాల్లో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. మొదట శుక్రవారం తెల్లవారు జామున 1.06 గంటల ప్రాంతంలో మణిపూర్లోని చందేల్లో ప్రకంపనలు వచ్చాయని ఎన్సీఎస్ తెలిపింది. రిక్టర్ స్కేల్పై 3.0 తీవ్రతతో భూమి కంపించిందని, మొయిరాంగ్కు 39 కిలోమీటర్ల దూరంలో, భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు చెప్పింది. మేఘాలయలోని వెస్ట్కాసి హిల్స్లో 4.20 గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్పై 2.6 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి.
నాంగ్పోకు 58 కిలోమీటర్ల దూరంలో.. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు ఎన్సీఎస్ పేర్కొంది. తెల్లవారు జామున 4.40 గంటల ప్రాంతంలో అసోంలో సోనిత్పూర్లో రిక్టర్ స్కేల్పై 4.1 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. తేజ్పూర్కు 36 కిలోమీటర్ల దూరంలో, 22 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు ఎన్సీఎస్ పేర్కొంది. అయితే, ప్రకంపనలతో ఎలాంటి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు. తెల్లవారు జామున జనం నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో భయాందోళనకు గురై బయటకు పరుగులు పెట్టారు. భూకంపాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.