భోపాల్ : మధ్యప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో జూన్ 1 నుంచి లాక్డౌన్ ఎత్తివేయడానికి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు మార్గదర్శకాలను కూడా వెల్లడించారు. కిరాణా దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వగా.. పాఠశాలలు, కళాశాలలు, సినిమా థియేటర్లు, మాల్స్ మూసివేత కొనసాగుతుంది. ప్రతి శనివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
అన్లాక్ మార్గదర్శకాల ప్రకారం.. మార్కెట్లో 25 శాతం దుకాణాలు మాత్రమే తెరిచేందుకు అనుమతించనున్నారు. ప్రైవేట్ కార్యాలయాల్లో 50 శాతం ఉద్యోగులతో పనిచేయించుకోవాలి. హోటళ్లు, రెస్టారెంట్లు కేవలం టేక్ హోం ఫెసిలిటీ మాత్రమే అందుబాటులో ఉంచాలి. టాక్సీల్లో డ్రైవర్తో పాటు ముగ్గురికి మాత్రమే ప్రయాణించేందుకు అనుమతి ఉన్నది. రాష్ట్రంలోని అన్ని జాతీయ ఉద్యానవనాలను తెరిచి ఉంచాలని ఆ రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
వారానికి 5 శాతం కంటే ఎక్కువ ఇన్ఫెక్షన్ రేటు ఉన్న ప్రాంతాలు, తక్కువ ఇన్ఫెక్షన్ రేటు ఉన్న జిల్లాలకు ప్రత్యేక మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. ఇండోర్, భోపాల్, సాగర్, మొరెనాలో ఇన్ఫెక్షన్ రేటు 5 శాతం కంటే ఎక్కువగా ఉండటంతో ఇక్కడ మార్గదర్శకాలు కఠినంగా అమలుచేయనున్నారు.
ఎక్కడైనా ఇన్ఫెక్షన్ కేసులు పెరిగితే ఆంక్షలు తిరిగి అమలు చేయబడతాయని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. అలాగే, వైరస్ సోకిన ఏ ఒక్కరినీ రోడ్లపై సంచరించడానికి అనుమతించవద్దని ఆదేశించారు.
ఆరేండ్ల క్రితం కేసులో హైకోర్టు తీర్పు.. ధర్మసంకటంలో పినరాయి ప్రభుత్వం
తొలి హిందీ వార్తాపత్రిక ప్రారంభం.. చరిత్రలో ఈరోజు
చైనాలో కలవరపెడుతున్న కొత్త రకం స్ట్రెయిన్
లెఫ్టినెంట్గా బాధ్యతలు చేపట్టిన పుల్వామా వీరుడి సతీమణి
2021 సెషన్ కోసం ఆన్లైన్ కోర్సులను ప్రారంభించిన యూజీసీ
వ్యాక్సిన్ వేసుకుంది.. లాటరీ కొట్టేసింది..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..