సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో షాజుల్నగర్లో ఎల్లమ్మగుడి కాలువ పొంగి పొర్లుతున్నది. ఈ క్రమంలో జగిత్యాల నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ కారు కాలువ ప్రవాహంలో కొట్టుకుపోయింది. గుర్తించిన స్థానికులు కారులో చిక్కుకున్న ఇద్దరిని రక్షించారు. మరో ఇద్దరు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను గంగ (40), కిట్టు (4)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.