ఇంఫాల్, ఏప్రిల్ 27: మణిపూర్లో తాజాగా మరోసారి హింస రేగింది. బిష్ణుపూర్ జిల్లాలో ఒక వర్గానికి చెందిన ఉగ్రవాదులుగా భావిస్తున్న కొంతమంది విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. శనివారం అర్ధరాత్రి నరన్సేనలోని భద్రతా బలగాల్ని లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ కాల్పుల్లో దాడిలో ఒక ఎస్ఐ, ఒక సీఆర్పీఎఫ్ జవాన్ మరణించారు.
ఒక ఇన్స్పెక్టర్, మరో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. ఎత్తయిన కొండలపై నుంచి దుండగులు భద్రతా దళాల క్యాంప్పై రెండు గంటలపాటు కాల్పులకు తెగబడ్డారని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు.