టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబీ 28 (SSMB28) వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ మొదలైంది. ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. త్రివిక్రమ్ ఏ సినిమాకు చేయని ప్రయోగం తొలిసారి ఈ సినిమాకు చేస్తున్నాడన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.
ఇంతకీ విషమేంటనుకుంటున్నారా..? సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలంటే స్పెషల్ సాంగ్స్ ఉంటాయి..కానీ స్పైసీ ఐటెంసాంగ్స్ మాత్రం ఏ సినిమాలో అంతగా పెట్టలేదు. అత్తారింటికి దారేది చిత్రంలో ఓ పార్టీ సాంగ్ పెట్టినప్పటికీ ఏరోటిక్ యాంగిల్ అంతగా కనిపించదు. కానీ ఇపుడు మహేశ్ సినిమాలో ఇపుడు టాప్ హీరోయిన్తో అలాంటి ఐటెం సాంగ్ ఒకటి పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడని జోరుగా టాక్ వినిపిస్తోంది.
అంతేకాదు ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన పనులపై ఫోకస్ పెట్టాడట. సుకుమార్ గతేడాది పుష్ప సినిమాలో ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ పాటతో మూవీ లవర్స్లో హీటెక్కించి బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. మరి ఇపుడు త్రివిక్రమ్ అలాంటి పాటేదైనా ప్లాన్ చేస్తున్నాడా..? అంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. ఎస్ఎస్ఎంబీ 28 రెచిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మాత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలంటే ఆకట్టుకునే సంభాషణలతోపాటు అర్థవంతమైన పాటలు సంగీత ప్రియుల్ని ఇంప్రెస్ చేసేలా ఉంటాయి. మరి ఈ సారి పర్ఫెక్ట్ గా ఎలాంటి ఐటెంసాంగ్ ప్లాన్ చేస్తున్నాడనేదానిపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.
ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా..ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై మేకర్స్ నుంచి త్వరలోనే క్లారిటీ రానుంది. అతడు, ఖలేజా లాంటి సినిమాల తర్వాత త్రివిక్రమ్-మహేశ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.