హైదరాబాద్: వేసవి సెలవులు, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు (Andhra Pradesh) చెందిన చాలా మంది హైదరాబాద్ నుంచి తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. ముఖ్యంగా ఏపీలో ఓట్ల తేదీ సమీపిస్తుండటంతో కుటుంబ సమేతంగా వెళుతున్నారు. దీంతో బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. బుకింగ్ చేసుకోవడానికి కూడా నెల రోజుల వరకు టికెట్లు దొరకని పరిస్థితి ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో చాలా మంది జనం ట్రావెల్ బస్సులను ఆశ్రయిస్తున్నారు.
ఇదే అదునుగా భావించిన కొన్ని ట్రావెల్స్ రెట్టింపు ధరలు (Ticket Price) వసూలు చేస్తున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రూ.800 ధర ఉంటే సుమారు 2వేల పైనే వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. రైల్వే, ఆర్టీసీ అధికారులు ఏపీకి ప్రత్యేక రైళ్లు, బస్సు సర్వీసులను పెంచాలని ప్రయాణికులు కోరారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సుల్లో సీట్లను ఏర్పాటు చేసి ప్రయాణికుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు. అధిక డబ్బులు వసూలు జేస్తున్న ట్రావెల్స్పై ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.