అమరావతి : ఏపీలో ఈఏపీసెట్( ఎంసెట్ ) (EAPSET exams ) పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురు, శుక్రవారం బైపీసీ(BPC) గ్రూపునకు ఎప్సెట్ , ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు ఇంజినీరింగ్ (Engineering ) విభాగానికి పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు ఆన్లైన్ మోడ్లో జరుగుతాయని ఏపీ ఉన్నత విద్యామండలి (AP Higher Education) చైర్మన్ ప్రొపెసర్ కె. హేమచంద్రరెడ్డి వెల్లడించారు.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండవ సెషన్గా పరీక్షలు జరుగుతాయని వివరించారు. పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 140 సెంటర్లు, హైదరాబాద్(Hyderabad) లో రెండు సెంటర్లను నెలకొల్పామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,61,640 మంది పరీక్షలు రాస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఇందులో మహిళలు 1,81,536 మంది విద్యార్థినులు, 1,80,104 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు.