హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం(Khammam) జిల్లా సీనియర్ నాయకుడు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాయల వెంకట శేషగిరి రావు మరణం(Rayala Venkata Seshagiri Rao) పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్(KCR) సంతాపం(Condoles) తెలిపారు. వారితో దశాబ్దాలకాలంగా తనకున్న రాజకీయ అనుబంధాన్ని, పలు పదవుల ద్వారా రైతాంగం కోసం, ప్రజలకోసం, పార్టీ కోసం శేషగిరిరావు చేసిన కృషిని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా, గత కొంతకాలంగా శేషగిరి రావు అనారోగ్యంతో బాధ పడుతున్నారు. హైదరాబాద్లోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం కన్నుమూశారు.