అమరావతి : ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం జల్లేరు వాగు (Jalleru river) లో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటమునిగి ముగ్గురు మృతి చెందారు. మృతులు ఊట్లపల్లి, దిబ్బగూడానికి చెందిన రేష్మ(24), మొహిషాద్(23), హసద్(14)గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు (Police) గజ ఈతగాళ్లతో మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.