అమరావతి : మూడు రాజధానుల పేరిట ఆంధ్రప్రదేశ్కు రాజధాని(Capital) లేకుండా చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆరోపించారు. కేంద్రం కూడా రాజధాని అమరావతే ఉంటుందని మరోసారి స్పష్టం చేసిందని, అమరావతిని కేంద్ర సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి భారతదేశంలోనే నంబర్వన్ రాజధానిగా నిర్మించితీరుతానని పేర్కొన్నారు.
అమరావతిని నాశనం చేసిన జగన్ను ఇంటికి పంపాల్సిందేనని వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కూటమి అభ్యర్థుల తరుఫున నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ హయాంలో నీటి పారుదల ప్రాజెక్టులను నిర్మించామని తెలిపారు. రాయలసీమ ద్రోహి వైఎస్ జగన్ అంటూ మండిపడ్డారు.
పోలవరం, మంద్రీనివాను పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తామని, గోదావరి మిగులు జలాలను చివరి ఆయకట్టు్ వరకు తీసుకొస్తామని వెల్లడించారు. ల్యాండ్ టైటిలింగ్ ద్వారా ప్రజల భూములను దోచుకునేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకని ప్రశ్నించారు.