ముంబై: ఆన్ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అసంతృప్తి వ్యక్తం చేసిన వెంటనే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న ఐపీఎల్లో సాఫ్ట్ సిగ్నల్ ఉండబోదని స్పష్టం చేసింది. ఏదైనా నిర్ణయాన్ని థర్డ్ అంపైర్కు నివేదించే సమయంలో ఆన్ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ అవసరం లేదని కోహ్లి ఈ మధ్యే అభిప్రాయపడ్డాడు. ఏవైనా వివాదాస్పద నిర్ణయాల విషయంలో థర్డ్ అంపైర్కు ఆన్ఫీల్డ్ అంపైర్ ఇచ్చేదే సాఫ్ట్ సిగ్నల్. ఇది ఈ మధ్య వివాదాలకు కారణమవుతోంది.
ఇదే విషయాన్ని కోహ్లి లేవనెత్తడంతో సాఫ్ట్ సిగ్నల్ను వచ్చే ఐపీఎల్లో వినియోగించకూడదని బీసీసీఐ నిర్ణయించినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. అంపైరింగ్ నిర్ణయాల్లో అయోమయానికి తావు లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. ఈ సాఫ్ట్ సిగ్నల్స్ మూడో అంపైర్కు స్పష్టతకు బదులు ఓ రకమైన అయోమయానికి గురి చేస్తున్న సందర్భాలు ఉన్నాయి.
ఈ మధ్య సాఫ్ట్ సిగ్నల్పై కోహ్లి మాట్లాడుతూ.. ఒకవేళ బాల్ స్టంప్స్ను తాకుతున్నా, మిస్ అవుతున్నా.. అది ఎంత మేర స్టంప్స్ను తాకుతుందన్నది అనవసరం. ఇది చాలా అయోమయానికి గురి చేస్తోంది. ఇక సాఫ్ట్ సిగ్నల్ విషయంలో ఫీల్డింగ్ టీమ్ స్పందన కూడా ప్రభావం చూపిస్తోంది. ఇది చాలా తీవ్రమైన విషయం. పెద్ద టోర్నీల్లో ఫలితాలనే మార్చగలదు. ఇలాంటి వాటిలో ఎలాంటి లోపాలు ఉండకూడదు అని స్పష్టం చేశాడు.
ఇవికూడా చదవండి..
100 కోట్లు ఇవ్వండి.. కేంద్రాన్ని కోరిన భారత్ బయోటెక్, సీరమ్
సుయెజ్ కాలువలో ఇరుక్కున్న ఎవర్గివెన్ షిప్ కాస్త కదిలింది
ప్రపంచంలో సెక్సీయెస్ట్ బాల్డ్ మ్యాన్.. ప్రిన్స్ విలియమ్
అనారోగ్యంతో బద్వేలు ఎమ్మెల్యే కన్నుమూత
ఎన్నికల సిత్రాలు.. దాండియా ఆడిన కేంద్ర మంత్రి
నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి