హైదరాబాద్, మార్చి 31, (నమస్తే తెలంగాణ): ఔట్డోర్ ప్రకటనల విధానానికి సంబంధించి గతంలో ఇచ్చిన కోర్టు ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని ఆదేశిస్తూ మున్సిపల్శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్కు హైకోర్టు కోర్టు ధికరణ నోటీసులు జారీచేసింది. మీపై కోర్టు ధికరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో తెలియజేయాలని కోరింది.
పిటిషనర్ల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని కొత్త ప్రకటనల విధానాన్ని రూపొందించాలని గత ఫిబ్రవరిలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయలేదంటూ తెలంగాణ ఔట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ సహా నాలుగు సంస్థలు కోర్టుధికరణ పిటిషన్లు వేశాయి. వీటిని జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ విచారించారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఔట్డోర్ ప్రకటనలకు చెందిన జీవో 84ను సవాల్ చేస్తూ గతంలో దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు అమలు చేయలేదని తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది.