హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయమంటే వృత్తికాదు..జీవితమని, సంస్కృతిని నేర్పే ఆయుధమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మట్టికి దూరం కావడమంటే తల్లిదండ్రులకు దూరమైనట్టేనన్నారు. గురువారం రెడ్హిల్స్లోని ఫ్యాప్సీలో నిర్వహించిన సీడ్స్ మెన్ అసోసియేషన్ వార్షిక సమావేశానికి మంత్రి నిరంజన్రెడ్డి హాజరై ప్రసంగించారు. ప్రపంచ విత్తనరంగాన్ని శాసించే స్థాయికి తెలంగాణ ఎదగాలని ఆకాంక్షించారు.
నిరంతర పరిశోధనలతోనే ప్రగతి సాధ్యమని, ఇందుకు ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తుందని భరోసా ఇచ్చారు. రైతును మించిన శాస్త్రవేత్తలు లేరని, వారు కూడా కాలానుగుణంగా మారాలని, రాబోయే యాసంగిలో పెద్దఎత్తున పత్తి సాగుకు రైతులు సిద్ధమవుతున్నారని వెల్లడించారు. దాదాపు 20 దేశాలకు విత్తనాలను ఎగుమతి చేస్తున్నామని, మరిన్ని దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరాలని పిలుపునిచ్చారు. అనంతరం సీడ్స్ మెన్ అసోసియేషన్ ఫౌండర్ ప్రొఫెసర్ యోగేశ్వరరావుకు విత్తనరంగ పితామహుడు బిరుదునిస్తూ జీవిత సాఫల్య పురసారం అందజేశారు.