హైదరాబాద్, ఏప్రిల్ 25(నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు ఆలిండియాలో 1, 3, 6,9 ర్యాంకులు సాధించి ప్రతిభ చూపారని శ్రీ చైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. ఆలిండియా క్యాటగిరీలో 10 లోపు 4 ర్యాంకులు, ఆలిండియా ఓపెన్ క్యాటగిరీలో 100 లోపు 25 ర్యాంకులు, 200 లోపు 46 ర్యాంకులు సాధించినట్టు పేర్కొన్నారు.
ఆలిండియాలో కేసీ బసవరెడ్డి 1వ ర్యాంకు, తోటంశెట్టి నిఖిలేశ్ 3వ ర్యాంకు, హిమాన్షూ తాలర్ 6వ ర్యాంకు, రెడ్డి అనిల్ 9వ ర్యాంకులతో సత్తా చాటినట్టు వివరించారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 272 మంది విద్యార్థులు వంద పర్సంటైల్ సాధించారని పేర్కొన్నారు. ర్యాంకులు పొందిన విద్యార్థులను, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని అభినందించారు.